సంగారెడ్డి: గుండె పోటుతో రిమాండ్ ఖైదీ మృతి ఘటన సంగారెడ్డి సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విఠల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం, రివాల్వర్తో బెదిరించాడనే ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు విఠల్ను అరెస్ట్ చేసి జ్యుడిషయల్ రిమాండ్లో భాగంగా 2026, జనవరి 31న సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు.
రిమాండ్ ఖైదీగా ఉన్న విఠల్ గురువారం (ఫిబ్రవరి 19) జైల్లో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే జైలు సిబ్బంది అతడిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విఠల్ మృతి చెందాడు. విఠల్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెళ్లి గ్రామమని పోలీసులు తెలిపారు.
