సర్టిఫికెట్లపై సీఎం ఫొటో తొలగించండి

సర్టిఫికెట్లపై సీఎం ఫొటో తొలగించండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న క్యాస్ట్ సర్టిఫికెట్, నో డ్యూ సర్టిఫికేట్ వంటి సర్టిఫికెట్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోను తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలతో పాటు కుల ధృవీకరణ పత్రాలతో పాటు నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్లను తహసీల్దారులు జారీ చేస్తారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సర్టిఫికెట్లపై కూడా ఆయన ఫొటో ప్రింట్‌ చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. దీంతో సీఎం జగన్ తో పాటు పాటు మరే ఇతర రాజకీయనేతల ఫొటోలు లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. దీనికి సంబందించి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.