మహేశ్‌ సినిమా వదులుకున్నా.. కాంట్రవర్సీ క్రియేట్‌ అవుద్ది కారణం చెప్పను : రేణూ దేశాయ్‌

మహేశ్‌ సినిమా వదులుకున్నా..   కాంట్రవర్సీ క్రియేట్‌ అవుద్ది కారణం చెప్పను  : రేణూ దేశాయ్‌

మహేష్ బాబు హీరోగా,పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రంలో తనకు  అవకాశం వచ్చిందని నటి రేణూదేశాయ్ తెలిపారు.  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాను చేయలేకపోయానని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.   సర్కారు వారి పాటలో బ్యాంకు అఫీసర్ పాత్ర కోసం తనని అడిగారని, ఆ పాత్ర కూడా తనకెంతో నచ్చినట్లుగా రేణూదేశాయ్  తెలిపారు. 

అయితే  కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానన్నారు.  నిజం ఎంటో చెప్పాలని ఉంది కానీ..  అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్‌ అవుతుందని దానికంటే కామ్ గా ఉండటమే బెటర్ అని చెప్పింది. ఈ సినిమాలో రేణూదేశాయ్ వదిలేసిన ఆ బ్యాంకు అఫీసర్ పాత్ర కోసం సీనియర్ నటి నదియాను తీసుకున్నారు మేకర్స్.   2022 మే 12న రిలీజైన సర్కారు వారి పాట రివ్యూలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

ఇక 2003లో వచ్చిన జానీ మూవీ తరువాత రేణూదేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు.  దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజ హీరోగా వస్తున్న  టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంతో  రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె  గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను పోషిస్తున్నారు.  ఈ సినిమా 2023 అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.