రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ప్రమాణం

రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ప్రమాణం

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం పార్లమెంట్ లోని ప్రత్యేక చాంబర్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ నూతన, తిరిగి ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయన్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  తెలంగాణ నుంచి కాంగ్రెస్ మెంబర్ గా రేణకా చౌదరి ప్రమాణం చేశారు. ఆమెతోపాటు గుజరాత్ నుంచి మయాంక్ భాయ్ జయదేవ్ భాయ్ నాయక్(బీజేపీ), కర్నాటక నుంచి  నారాయణ కృష్ణాసా భాండాగే(బీజేపీ), మహారాష్ట్ర నుంచి మిలింద్ మురళీ దేవరా (శివసేన), డాక్టర్ అజిత్ మాధవరావు గోప్‌‌చాడే(బీజేపీ), యూపీ నుంచి అమర్‌‌పాల్ మౌర్య(బీజేపీ), సంజయ్ సేట్(బీజేపీ), రామ్‌‌జీ లాల్ సుమన్(ఎస్పీ), వెస్ట్ బెంగాల్ నుంచి సాగరిక ఘోష్(ఏఐటీసీ), మమతా ఠాకూర్(ఏఐటీసీ) రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా... రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ, అనిల్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే వద్ది రాజు రవిచంద్ర, అనిల్ యాదవ్ రాజ్య సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.