సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్​ఎస్​కు ఎదురుతిరుగుతున్నారు

సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్​ఎస్​కు ఎదురుతిరుగుతున్నారు
  • క్యాంపుల్లో పెట్టి కాపలా కాస్తున్నారు
  • సర్కారుకు రైతుల ఉసురు తగులతది
  • బీజేపీ లీడర్ బాబూమోహ‌‌న్‌‌ 

జోగిపేట, వెలుగు:  సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్​ఎస్​కు ఎదురుతిరుగుతున్నారని, వాళ్లను  కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించి  కాపలా కాస్తున్నారని  బీజేపీ రాష్ట్ర నాయ‌‌కుడు, మాజీ మంత్రి బాబూమోహ‌‌న్ అన్నారు.  సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆయన బుధ‌‌వారం మీడియాతో మాట్లాడారు. మెద‌‌క్ లోకల్​బాడీ ఎమ్మెల్సీ పరిధిలో టీఆర్ఎస్​కు మెజారిటీ ఉన్నా  క్యాంపులకు తరలించడమంటే వారిమీద నమ్మకం లేనట్టేనని అన్నారు. టీఆర్ఎస్ టికెట్​ మీద గెలిచిన నేతలే ఆ పార్టీని నమ్మడం లేదంటే ప్రజలు, రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అసంతృప్తివాదులంతా బీజేపీకి ఓటేస్తామని.. క్యాండిడేట్​ను నిలబెట్టాలని సూచించారని,  కానీ అధిష్టానం నిర్ణయం మేరకు  పోటీకి దూరంగా ఉన్నట్టు చెప్పారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం పాలసీ క్లియర్​గా ఉందని, కానీ టీఆర్​ఎస్​ ప్రభుత్వం  బుర‌‌ద‌‌ జ‌‌ల్లుతోందని మండిపడ్డారు.  హుజూరాబాద్ ఎన్నిక‌‌ల్లో ఓట‌‌మి తర్వాత ప్రభుత్వం రైతులను వేధిస్తోందని, ​ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న  టీఆర్ఎస్​కు వారి ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్, ఆయ‌‌న టీం మాట్లాడే భాష అనాగ‌‌రికులు కూడా వాడరని అన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాప‌‌న చేస్తోంద‌‌న్నారు. వరి వేయొద్దంటున్న కేసీఆర్​ లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు సయ్య సాయి, ఆనంద్ శర్మ, సుమన్, అర్జున్, రాకేష్  పాల్గొన్నారు.