హైదరాబాద్, వెలుగు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఆట కట్టించేందుకు హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్స్ కృషి చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ తయారీలో ఉండగా, మరికొన్ని వైరస్ నిర్ధారణ టెస్ట్లు చేస్తున్నాయి. వెంటిలేటర్లు, మొబైల్ వైరాలజీ ల్యాబ్లు తయారుచేసి ప్రభుత్వానికి అందించడం మొదలు జిల్లాల్లో యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్ట్ వరకూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్19 పుట్టుక, వ్యాప్తి, వ్యాక్సిన్పై రీసెర్చ్ చేస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
సెంట్రల్ యూనివర్సిటీలో..
- హెచ్ సీయూ లైఫ్సైన్స్ డిపార్ట్ మెంట్ కి చెందిన డాక్టర్ సీమా.. ఇమ్యూనిటీ పవర్పెంచే ‘టి-సెల్ ఎపిటోప్స్’ వ్యాక్సిన్ తయారు చేశారు.
- అడ్వాన్స్డ్ ఎలక్ర్టానిక్స్ ల్యాబ్కు చెందిన సైంటిస్ట్లు పహాడీషరీఫ్లోని ఏఆర్ సీఐతో బయటి పరిసరాల్లో కరోనాను చంపే మెషీన్ డిజైన్ చేశారు.
- పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను ఆ మెషీన్పై ఉంచితే వైరస్ ఉన్నా చనిపోతుంది.
- సోషియాలజీ డిపార్ట్మెంట్ సెర్వ్ పేరుతో కోవిడ్ బాధితులు, ఎంప్లాయీస్కు సలహాలు ఇస్తోంది.
3 జిల్లాలకు ఎన్ఐఎన్…
- ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు నేషనల్ న్యూట్రిషీయన్ ఇనిస్టిట్యూట్(ఎన్ఐఎన్) జనగామ, నల్గొండ, కామారెడ్డిలో సెరో సర్వేలెన్స్ పేరుతో యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్ట్ చేయనుంది.
- ఒక్కో జిల్లాలో 10టీమ్లు పాల్గొంటాయి.
- ఈ సర్వేతో వైరస్ కమ్యూనల్ స్ర్పెడ్ జరుగుతుందా, లేదా? అన్నది తేలుతుంది.
మాలిక్యుల్స్ తయారీలో ఐఐసీటీ
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన 30 మంది సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కోసం మాలిక్యుల్స్ తయారీ ప్రారంభించారు.
- ఇప్పటిరకు రెమిడెసివిర్, ఆర్బిటాల్ డ్రగ్, యూమిఫెనోవిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాలిక్యుల్స్ రెడీ చేశారు.
- ఐఐసీటీ ఫార్ములా ఆధారంగా ఫార్మా కంపెనీ సిప్లా మెడిసిన్ తయారుచేసింది. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
- వైరస్ కంట్రోల్కు చైనా వాడిన ఆర్బిటాల్ డ్రగ్ నుంచి ఇక్కడి సైంటిస్ట్ లు మరో మాలిక్యుల్ సిద్ధం చేశారు. ఆ మెడిసిన్ అందుబాటులోకి రావడానికి 6 నెలలు పడుతుంది.
వైరస్ జీనోమ్పై సీసీఎంబీ ఫోకస్
- తార్నాకలోని ది సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ).. కోవిడ్19 జీనోమ్పై రీసెర్చ్ చేస్తోంది.
- వైరస్ పుట్టుక, లక్షణాలు, వ్యాప్తి, ఇతర వ్యాధులకు అవకాశాలు.. లాంటి అంశాలపై రీసెర్చ్ జరుగుతోంది.
- ప్రైవేట్ ఫార్మా కంపెనీల టెస్టింగ్ కిట్లను వ్యాలిడేషన్ చేస్తోంది.
- మహారాష్ట్ర, రాజస్థాన్, హైదరాబాద్లోని పాజిటివ్ కేసుల నుంచి నమూనాలు సేకరించిన సీసీఎంబీ సైంటిస్ట్లు వైరస్ డీఎన్ఏ, ఉత్పరివర్తనం(మ్యుటేషన్స్)పై కొంత ప్రగతి సాధించారు.
- ఇప్పటివరకూ 2,500 సస్సెక్టర్స్ శాంపిల్స్కు పూల్ టెస్టింగ్చేశారు.
- కరోనా టెస్ట్ లు ఎలా నిర్వహించాలనే దానిపై 25 మంది డాక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు.
డీఆర్ డీవో.. మొబైల్ వైరాలజీ ల్యాబ్
- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్ డీవో ) తన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి15 రోజుల్లో మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ను రెడీ చేసింది.
- వెయ్యి నుంచి 2 వేల వరకు కరోనా టెస్ట్ లు చేయగల ఈ ల్యాబ్ను ఇటీవల సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణలో
ప్రారంభించారు. - వైరస్ జీనోమ్, వ్యాక్సిన్ తయారీ రీసెర్చ్కూ యూజ్ అవుతుంది.
- మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను టెస్ట్ల కోసం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
- డీఆర్ డీవో 30 వేల వెంటిలేటర్లు, డిస్ ఇన్ ఫెక్టివ్ టన్నెల్స్ తయారుచేసి ప్రభుత్వానికి అందించింది.
సీడీఎఫ్డీలో టెస్ట్లు
- సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రిం టింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్ డీ) కరోనా టెస్టుల్లో నిమగ్నమైంది.
- సీసీఎంబీలో ట్రైనింగ్ తీసుకున్న హెచ్సీయూ రీసెర్చ్ స్కాలర్స్ 15 మంది బీఎస్ఎల్–-2 ల్యాబ్ లో ఈ పరీక్షలు చేస్తున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన శాంపిల్స్ డేటా ఎంట్రీ నమోదు, సార్టింగ్తోపాటు ఇతర ల్యాబ్స్ను కో ఆర్డినేట్ చేస్తున్నారు.