ఆహారపు అలవాట్లని బట్టి కూడా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కూరగాయలు ఎక్కువ తినాలంటారు డాక్టర్లు. కూరగాయలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం14 శాతం తక్కువని లండన్కి చెందిన బిఎంసి మెడిసిన్ జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీ చెప్తోంది. క్యాన్సర్ రిస్క్ని పెంచే ఫుడ్ గురించి తెలుసుకునేందుకు యూకె బయో బ్యాంక్లోని నాలుగు లక్షల యాభైవేల మంది డేటాని స్టడీ చేశారు రీసెర్చర్లు. అందుకోసం తినే తిండిని బట్టి వాళ్లని గ్రూప్లుగా విభజించారు. ఒక వారంలో ఐదుసార్లు ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్, పౌల్ట్రీ మీట్ తినేవాళ్లు– వారంలో ఐదుసార్ల కంటే తక్కువ మాంసం తినేవాళ్లు– చేపలు మాత్రమే తినేవాళ్లు– పూర్తిగా కూరగాయలే తినేవాళ్లు– ఇలా వీళ్లను 4 గ్రూప్లుగా చేశారు. స్టడీలో రీసెర్చర్లు గుర్తించిన విషయాలేంటంటే...
మాంసం తినేవాళ్ల కంటే మాంసం తక్కువ తినేవాళ్లకు అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ 2 శాతం తక్కువ. చేపలు తినేవాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశం 10 శాతం తక్కువ. కూరగాయలు తినేవాళ్లలో అయితే క్యాన్సర్ రిస్క్14 శాతం తక్కువ. వెజిటేరియన్ డైట్ తినే ఆడవాళ్లలో మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువ. చేపలు తినే మగవాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ 20 శాతం, కూరగాయలు తినే మగవాళ్లలో 31 శాతం తక్కువట. మాంసం, చేపలు తినే వాళ్లతో పోల్చితే కూరగాయలు తినేవాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కూడా చెప్తున్నాయి.