IAS కృష్ణయ్య ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: కృష్ణ ప్రసాద్

IAS కృష్ణయ్య ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: కృష్ణ ప్రసాద్

తెలంగాణకు చెందిన ఐఏఎస్ కృష్ణయ్యను హత్య చేసిన  వ్యక్తిని జైలు నుండి రిలీజ్ చేస్తే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ నాయకులు కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లి నితీశ్ కుమార్ తో వేదికను పంచుకుంటాడు కానీ ఈ అంశంపై  మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ కు   ఐఏఎస్, ఐపీఎస్ ల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్న ఈ అంశంపై స్పందించాలన్నారు. మీరు చేసింది తప్పంటూ    సీఎం నితీశ్ కుమార్ కు  కేసీఆర్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.  కృష్ణయ్య బీహార్ క్యాడర్ అయినప్పటికీ స్పెషల్ కేసుగా పరిగణించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు కృష్ణ ప్రసాద్.

ఐఏఎస్ కృష్ణయ్యను చంపిన వ్యక్తి ఆనంద్ మోహన్ హైదరాబాద్ కు వస్తున్నాడని తెలిసిందని.. ఈక్రమంలో కృష్ణయ్య ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని కోరారు కృష్ణ ప్రసాద్.  ఆయన ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదన్నారు.   నేరస్థుడిని విడుదల చేసేందుకు బీహర్ సీఎం నితీశ్ ప్రభుత్వం ఒక క్లాజును డిలీట్ తొలగించారని ఆరోపించారు.