ముషీరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్, ఆర్పీఎస్–2017 వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సారథ్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రిటైర్మెంట్ రోజునే రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటికీ రాకపోవడం విచారకరమన్నారు. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్న తమకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.
