కాంగ్రెస్ లో అమ్ముడు పోయే నేతలను బయటకు పంపాలి

కాంగ్రెస్ లో అమ్ముడు పోయే నేతలను బయటకు పంపాలి

కాంగ్రెస్ లో అమ్ముడు పోయే నేతలను బయటకు పంపాలన్నారు ఆపార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. డిపాజిట్లు రాని నేతలే పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు రేవంత్. ఎక్కడ నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలే గెలిపిస్తారన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు చావు తప్పి కన్ను లోట్టబోయినట్లుగా  గెలిచిందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఓటింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థిపై దుష్ప్రచారం చేశారన్నారు పొన్నం.