చంద్రబాబుకు కాళోజీ పుస్తకం కానుకగా ఇచ్చిన రేవంత్

 చంద్రబాబుకు కాళోజీ పుస్తకం కానుకగా ఇచ్చిన రేవంత్

రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ప్రజా భవన్ లో ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భందగా తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణ రాసిన ‘నా గొడవ’ కవితల సంకలనాన్ని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కానుకగా ఇచ్చారు. 

కాగా,  ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ పలువురు ఐఏఎస్  అధికారులు హాజరయ్యారు.