తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ సమావేశమయ్యారు. తన ప్రమాణ స్వీకారినికి హాజరు కావాలని రేవంత్ వారిని ఆహ్వానించారు. అంతకుముందు రేవంత్..కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో కూడా భేటీ అయ్యారు.
ఇవాళ మధ్యాహ్నం రేవంత్ ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన గెలిచారు రేవంత్. తాజాగా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవటంతో ఎంపీ పదవికి రాజీనామ చేయనునన్నారు.