
తెలంగాణ సెక్రటేయట్ కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సెక్రటేరియట్ కూల్చివేతతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
సచివాలయం కూల్చివేతపై ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT) కూ రేవంత్ పిర్యాదు చేశారు. ఇటీవల నగరానికి వచ్చిన NGT టీంను ఆయన కలిశారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కమిటీకి వివరించారు. హుస్సేన్సాగర్ చుట్టుపక్కల ఒక కిలోమీటరు పరిధి వరకు ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదంటూ 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 2001 తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని రేవంత్ NGT టీంకు వివరించారు.