పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే ఉపేక్షించం : రేవంత్ రెడ్డి

పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే ఉపేక్షించం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రెేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని నాయకులకు ఆదేశించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.