కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి టికెట్ ఇచ్చాం:రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి టికెట్ ఇచ్చాం:రేవంత్ రెడ్డి

గ్రేటర్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడమ్ సంతోష్ కుమార్ కు మద్దతుగా సికింద్రాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. సిటీలోని బస్తీల్లో సమస్యలను పరిస్కరిస్తామని రేవంత్ చెప్పారు. సిటీలో శాంతి భద్రతలకు కాంగ్రెస్ కృషి చేసిందని అన్నారు.  కాంగ్రెస్ వస్తే 200 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు కట్టనవసరం లేదని.. సోనియమ్మనే కడుతుందన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ను  రూ.500లకే  ఇస్తామని..  ఇళ్లు కట్టుకునేందుకు పేదలకు రూ.5లక్షలు ఇస్తామన్నారు. 

హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.  బీసీలు, మైనార్టీలకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిందని.. వారికి అండగా ఉంటుందని అయన అన్నారు. కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి  ఆడమ్ సంతోష్ కు టికెట్ ఇచ్చామన్నారు.  పది సంవత్సాలు దొంగలకు అవకాశం ఇచ్చారని.. ఒక్క సారి ఆడమ్ సంతోష్ కు అవకాశం ఇవ్వాలని రేవత్ రెడ్డి అభ్యర్థించారు.