పేరు పేరునా ధన్యవాదాలు..రేవంత్ రెడ్డి ట్వీట్

పేరు పేరునా ధన్యవాదాలు..రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్:  ‘శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు.‘గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నిఖార్సుగా నిలబడ్డారు.’ అని పేర్కొన్నారు. ‘మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది..’ అంటూ అందరికీ అభినందనలు తెలిపారు.