- ఆర్ఎఫ్సీఎల్ సిబ్బందికి యాజమాన్యం అభినందనలు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) మే నెలలో 1,07,883 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. ఇందులో తెలంగాణకు 64,299.15 మెట్రిక్ టన్నులు, ఏపీకి 8,175.15 మెట్రిక్ టన్నులు, కర్నాటకకు 11,305.26 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 7,900.47 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 8,291.07 మెట్రిక్ టన్నులు, చత్తీస్గఢ్కు 7,912.35 మెట్రిక్ టన్నులు సప్లై చేశారు.
యూరియా ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులను ప్లాంట్ హెడ్ ఎస్.కె.జిందాల్ అభినందించారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ రూ.200 కోట్లతో హై టెంపరేచర్ రీఫార్మర్ (హెచ్ టీఆర్) మెషీన్ను ఏర్పాటు చేసింది. గత జనవరిలో ఈ మెషీన్ ఫెయిల్ కావడంతో రిపేర్ల కోసం మార్చి 25న ముంబైకి తరలించారు. మెషీన్ పనిచేయకపోవడంతో యూరియా ఉత్పత్తి రోజుకు 3,850 నుంచి 3,200 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఈ ప్రభావం వానాకాలం సీజన్పై పడనుంది.
