తండ్రి చివరి చూపునకు నోచులేక పోయిన రిషీ కూతురు రిద్ధిమా

తండ్రి చివరి చూపునకు నోచులేక పోయిన రిషీ కూతురు రిద్ధిమా

బాలీవుడ్ నటుడు రిషికపూర్ అంత్యక్రియలకు ఆయన కుమార్తె రిద్ధిమా కపూర్ హాజరుకాలేకపోయారు. నాన్న కడచూపునకు నోచుకోలేకపోయారు. లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిద్ధిమా కపూర్ సహా ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే అనుమతి దొరకడం ఆలస్యమైంది. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా బయలుదేరాలని మొదట అనుకున్నారు. సాయంత్రం 5 గంటలలోగా అంత్యక్రియలు ముగించాలన్న ముంబై పోలీసుల నిబంధననుసరించి రిద్ధిమా చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. 14 వందల కిలోమీటర్ల ప్రయాణం సాయంత్రం 5లోగా పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో చివరి క్షణంలో ప్రైవేట్ విమానం ద్వారా ముంబై చేరుకోవాలనుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఆమె..నాన్న రిషీ కపూర్ కడచూపునకు నోచుకోలేకపోయారు.

ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారమే ముంబై చందన్‌వాడి శ్మశానవాటికలో రిషీ కపూర్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు హాజరై…అంతిమ వీడ్కోలు పలికారు.