కొలంబో: శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ సొంతగడ్డపై విజయంతో వన్డే కెరీర్కు ముగింపు పలికాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 91 రన్స్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ పెరీ రా(111) సెంచరీ చేయగా, కుశాల్ మెండిస్(43), మాథ్యూస్(48) రాణించారు. ఛేజింగ్ లో 41.4 ఓవర్లు ఆడిన బంగ్లా 223 రన్స్ చేసి ఆలౌటైంది. ముష్ఫికర్(67), రెహమాన్(60) హాఫ్ సెంచరీలు చేశారు. మలింగ(3/38), ప్రదీప్(3/51) మూడేసి వికెట్లు తీశారు. కెరీర్లో చివరి వన్డే ఆడిన మలింగ 42 ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్(18)ను ఔట్ చేసి మ్యాచ్ ముగించాడు. కెరీర్లో 226
వన్డేలు ఆడిన మలింగ మొత్తం 338 వికెట్లు తీశాడు. కెరీర్ చివరి మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన లసిత్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జా బితాలో అనిల్ కుం బ్లే(337) ను వెనక్కునెట్టాడు.