వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌‌‌‌

వెస్టిండీస్ తో మూడు వన్డేల  సిరీస్ లో బోణీ  కొట్టిన బంగ్లాదేశ్‌‌‌‌

మిర్పూర్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న బంగ్లాదేశ్‌‌‌‌.. వెస్టిండీస్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌లో బోణీ చేసింది. లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రిషాద్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (6/35) కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ గణాంకాలు నమోదు చేయడంతో.. ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లా 74 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన బంగ్లాదేశ్‌‌‌‌ 49.4 ఓవర్లలో 207 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.

 తౌహిద్‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌ (51) హాఫ్‌‌‌‌ సెంచరీ చేయగా, మెహిదుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ అంకోన్‌‌‌‌ (46), నజ్ముల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ షాంటో (32), రిషాద్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (26) రాణించారు. జేడెన్‌‌‌‌ సీల్స్‌‌‌‌ 3, రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌, జస్టిన్‌‌‌‌ గ్రీవ్స్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌ 39 ఓవర్లలో 133 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. అలిక్‌‌‌‌ అథనాజే (27), షై హోప్‌‌‌‌ (15) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. రిషాద్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.