తమిళనాడు కొత్త గవర్నర్‌గా RNరవి ప్రమాణం

తమిళనాడు కొత్త గవర్నర్‌గా RNరవి ప్రమాణం

తమిళనాడు కొత్త గవర్నర్‌గా RN రవి ప్రమాణస్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సాహిబ్ బెనర్జి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇవాళ(శనివారం)  ఉదయం  రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి తమిళనాడు సీఎం  ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామి, కేంద్రమంత్రి ఎల్ మురుగన్‌ తో పాటు పలువురు  మంత్రులు హాజరయ్యారు.

ఆ తర్వాత సీఎం  స్టాలిన్ తన క్యాబినెట్ సహచరులను నూతన గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక పుస్తకాన్ని బహూకరించారు. తర్వాత  చీఫ్ జస్టిస్ సాహిబ్ బెనర్జి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ రవికి పరిచయం చేశారు. 

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో రవిని నూతన గవర్నర్‌గా నియమించారు. ఆర్ఎన్ రవి బీహార్ రాజధాని పట్నాకు చెందిన వారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన RN రవి.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన CBIలోనూ, IBలోనూ పనిచేశారు.