అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్

అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్

ఐపీఎల్ టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 5 లక్షల విలువైన వంద ఐపీఎల్ టికెట్లు,రెండు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. ఐపీఎల్ కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో  టికెట్లను అక్రమ పద్ధతిలో సేకరించి క్రికెట్ వాట్సప్ గ్రూపులను పెట్టి.. సోషల్ మీడియా ద్వారా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తునట్లు తెలిపారు. సన్ రైజర్స్  హైదరాబాద్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ కి సంబంధించి టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన రమణ, హైదరాబాదుకు చెందిన శామ్యూల్ సుశీల్ లను అరెస్టు చేసి గోపాల్ పురం పోలీసులకు అప్పగించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.