యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు 100బుల్డోజర్లతో స్వాగతం పలికారు బిలాస్ పూర్ వాసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిలాస్ పూర్ లో పర్యటించిన సీఎం యోగికి ఈ అరుదైన స్వాగతం లభించింది. మాఫియాపై యోగి చేపట్టిన బుల్డోజర్ యాక్షన్ కు ప్రతీకగా ఈ రకంగా వెల్కమ్ ప్లాన్ చేశారు బీజేపీ శ్రేణులు. యోగి కాన్వాయ్ బిలాస్ పూర్ లోకి ఎంటర్ అయ్యే చోట 100 బుల్డోజర్లు క్యూలో నిలబెట్టి ఆయనకు స్వాగతం పలికారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
CM Yogi Adityanath received the Guard of Honor from Bulldozers in Bilaspur. pic.twitter.com/0M5TdnNZLE
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 25, 2024