కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి.. 10 మందికి గాయాలు

కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి.. 10 మందికి గాయాలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జెడ్.కొత్తపల్లి సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

బ్రహ్మంగారిమఠం మండలం చెన్నంపల్లికి చెందిన కూలీలు జీవి సత్రం ప్రాంతంలోని పొలాల్లో పనులకు ట్రక్ ఆటో బయలు దేరారు. ఆటో జడ్.కొత్తపల్లి సమీపంలోకి రాగానే ఓ లారీ ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీంతో ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో ఓ కూలీ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ను జెడ్.కొత్తపల్లె టోల్‌గేట్ వద్ద  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.