నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్‌‌, ఎడపల్లి మండల కేంద్రం శివారులోని సాటాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌‌ను లారీ వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న గోసంగి చింతల అర్జున్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలతో కలసి ఊరూరా తిరిగి ఆయుర్వేద మందులు అమ్ముకునే అర్జున్.. ఈ రోజు ఉదయం తన టీవీఎస్ బైక్‌ మీద భార్యా, పిల్లలతో కలసి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మోటార్ సైకిల్ మీద అర్జున్‌తోపాటు అతడి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో వారికీ గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు  బోధన్‌‌లోని గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్జున్ దంపతులు నిజామాబాద్‌‌లోని సుభాష్ నగర్‌‌లో ఉంటున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌‌‌‌ను ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.