వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్

వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్

వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  సుష్మా థియేటర్‌ సమీపంలోని  సిగ్నల్ వద్ద  వేగంగా వస్తున్న టిప్పర్  బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యవకులు అక్కడిక్కడే మృతి చెందారు.    మృతులను కూకట్ పల్లికి చెందిన సతీశ్, వీరబాబుగా గుర్తించారు. వీరు ఇటుక లోడ్ ను ఖాళీ చేయటానికి వనస్థలిపురానికి వెళ్లినట్లు సమాచారం.  స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.