మెహిదీపట్నం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రలో చైన్ స్నాచర్లు చేతివాటం చూపారు. దీంతో గురువారం మంగళ్ హాట్ పీఎస్ కు బాధితులు క్యూ కట్టారు. వివరాల్లోకి వెళితే... శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సిటీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కొందరు చైన్ స్నాచర్లు భక్తుల మెడలోని చైన్లతో పాటు సెల్ ఫోన్లు లాక్కొని పారిపోయారు.
భక్తులు తేరుకొని చూసుకునే సరికి మెడలో చైన్లు లేకపోవడం, సెల్ ఫోన్లు పోవడం గమనించి మంగళ్హట్ స్టేషన్ కు క్యూ కట్టారు. 8 మంది మెడలోని చైన్ల తోపాటు ఓ వ్యక్తి బ్రాస్ లెట్, 20 మందికి పైగా సెల్ ఫోన్లు పోయినట్లు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చైన్స్ స్నాచర్ల ను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.