ఐదు ఇండ్లలో..2 లక్షల నగలు చోరీ 

ఐదు ఇండ్లలో..2 లక్షల నగలు చోరీ 

గజ్వేల్​(వర్గల్​), వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం గోవిందాపూర్​ గ్రామంలో బుధవారం రాత్రి తాళం వేసిన ఇండ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ  శివకుమార్​ తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన లింగ శ్రీనివాస్​, కేసరి రామవ్వ  మరో ముగ్గురు ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. గురువారం ఉదయం వీరి ఇండ్ల తలుపులు తెరచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు బాధితులకు సమాచారం ఇచ్చారు.

ఈ మేరకు లింగ శ్రీనివాస్​, కేసరి రామవ్వల ఇండ్లలో  బీరువాలో ఉంచిన బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. మరో మూడు ఇండ్లలోకి ఎలాంటి వస్తువులు పోలేదని తెలిసింది. మొత్తం రూ.2 లక్షల విలువైన నగలు చోరీ అయినట్లు ఎస్ఐ తెలిపారు.