DDCA ప్రెసిడెంట్‌గా అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ

DDCA ప్రెసిడెంట్‌గా అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ

కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్‌ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (DDCA) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్‌ 30 వరకు ఆయన DDCA అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరీత్యా లాయర్ అయిన రోహాన్‌.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనలతో డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు.

ఈ సందర్భంగా రోహాన్‌ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. రోహాన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ క్రికెట్‌ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు.