న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20 లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. 60 పరుగులు చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు 24 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన కెప్టెన్ వీరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. టీ20ల్లో రోహిత్ 25 సార్లు 50కు పైగా స్కోర్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీరాట్ కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు చేశాడు కానీ ఒక్క సెంచరీ చేయలేదు. కోహ్లీ తర్వాత మార్టిన్ గుప్తిల్ , పాల్ స్టిర్లింగ్ 17 సార్లు 50 కు పైగా స్కోరు చేశారు.
see more news