శ్రీలంకతో సిరీస్ కు రోహిత్, రాహుల్ దూరం!

శ్రీలంకతో సిరీస్ కు రోహిత్, రాహుల్ దూరం!

టీమిండియాకు షాక్ తగలనుంది. జనవరిలో శ్రీలంకతో జరగనున్న  టీ20, వన్డే సిరీస్ లకు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరమయ్యే చాన్స్ ఉంది.  బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో గాయపడ్డ  రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో రోహిత్ శ్రీలంకతో సిరీస్ లకు అందుబాటులో ఉండడని  బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక కేఎల్ రాహుల్ పెళ్లి  చేసుకోబోతున్న కారణంగా  సిరీస్ లకు దూరం అవతున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం అయితే టీ20లకు హార్ధిక్ పాండ్యా.. వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ తీసుకోనున్నారు. రోహిత్, రాహుల్ ఎంపికపై ఇంకా బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు.మూడు టీ20లు, మూడు వన్డేల కోసం శ్రీలంక జనవరి 3 నుంచి జనవరి 15 వరకు భారత్‌లో పర్యటించనుంది.

మరో వైపు కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ ల ఫామ్ గురించి కూడా ఆందోళనగా ఉంది. ఈ సంవత్సరంలో వీళ్లు పెద్దగా రాణించడం లేదు. ఈ సంవత్సరం 29 టీ20ల్లో 656 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 72.   ఇక ఆసియా కప్ తర్వాత టీ20ల్లో రాహుల్ పనితీరు ఆశించిన విధంగా లేదు. 16 ఇన్నింగ్స్ లకు గాను అతడు కేవలం ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. మిగిలిన 10 ఇన్నింగ్స్ లలో అతడు ఒక అంకె స్కోరుకే వెనుదిరిగాడు