టీ20లను వదిలేసే  ఆలోచనైతే లేదు: రోహిత్ శర్మ

టీ20లను వదిలేసే  ఆలోచనైతే లేదు: రోహిత్ శర్మ

గౌహాతి: టీ20లకు దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని టీమిండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ స్పష్టం చేశాడు. ఐపీఎల్​ తర్వాత దీని గురించి ఆలోచిస్తానన్నాడు. ‘ఇప్పుడు ఆరు టీ20లు మాత్రమే ఉన్నాయి. అందులో మూడు కంప్లీట్​ అయ్యాయి. అందుకే కుర్రాళ్లతో మేనేజ్​ చేశాం. ఐపీఎల్​ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే షార్ట్​ ఫార్మాట్​కు దూరంగా ఉండాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని రోహిత్​ పేర్కొన్నాడు. 2024 టీ20 వరల్డ్​కప్​ నేపథ్యంలో యంగ్​స్టర్స్​తో టీమ్​ను రెడీ చేయాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో, రోహిత్​, కోహ్లీ, కేఎల్​ రాహుల్​ను షార్ట్​ ఫార్మాట్​ నుంచి తప్పిస్తారన్న వార్తలు వస్తున్నాయి.