
గౌహాతి: టీ20లకు దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత దీని గురించి ఆలోచిస్తానన్నాడు. ‘ఇప్పుడు ఆరు టీ20లు మాత్రమే ఉన్నాయి. అందులో మూడు కంప్లీట్ అయ్యాయి. అందుకే కుర్రాళ్లతో మేనేజ్ చేశాం. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే షార్ట్ ఫార్మాట్కు దూరంగా ఉండాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని రోహిత్ పేర్కొన్నాడు. 2024 టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో యంగ్స్టర్స్తో టీమ్ను రెడీ చేయాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో, రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ను షార్ట్ ఫార్మాట్ నుంచి తప్పిస్తారన్న వార్తలు వస్తున్నాయి.