టీ20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్ 12లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన రోహిత్ సేన..ఈ మ్యాచ్లోనూ గెలిచి..సెమీస్ బెర్తు ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. అటు పటిష్టంగా ఉన్న భారత జట్టును ఓడించి..సెమీస్కు దూసుకుపోవాలని సౌతాఫ్రికా పట్టుదలతో బరిలోకి దిగింది.
https://twitter.com/ICC/status/1586667652818214913
టీమిండియా తుది జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అశ్విన్, షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్.
సౌతాఫ్రికా తుది జట్టు: బవూమ (కెప్టెన్), డికాక్, రొసో, మార్క్రమ్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్ , కేశవ్, నోర్జ్, ఎంగిడి, రబాడ.