ప్రేమ జంటలు పబ్లిక్గా బరితెగిస్తున్నాయి. బైక్పై వెకిలి చేష్టలతో విగుటు పుట్టిస్తున్నాయి. రోజుకు రోజుకు ప్రేమ జంటల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. స్కూటీపై వెళ్తూ ముద్దుల్లో మునిగిపోయారు. ప్రస్తుత ఈ వీడియో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలో లవర్స్ ఓ స్కూటీపై రోడ్డుపై వెళ్తున్నారు. చీకటి సమయం.. చుట్టు ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. అయితే ఈ సమయంలో హద్దులు దాటిన ప్రేమికులు..ముద్దుల్లో మునిగిపోయారు. ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని కూర్చున్నారు. పక్కనే పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్న పట్టించుకోలేదు.. కనీసం భయం కూడా లేదు. కొంత దూరం వెళ్లాక..ఒకేసారి రెండు మూడు వాహనాలు రావటంతో చేతులు విడిచిపెట్టారు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ప్రేమికుల చేష్టలకు సంబంధించి వెనకాల ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఎక్కడా దొరకలేదా...
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్లేస్ లేదా అంటూ కొందరు... స్కూటీపై ఎందుకు బరి తెగించారంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు. స్కూటీ మీద ఈ పాడు పనులేంది అని కొందరు ప్రశ్నించారు. ప్రేమికులు బాగా బరితెగిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్లు చేశారు.