మధ్యాహ్న భోజనంలో కూరకు బదులుగా ఉప్పు

మధ్యాహ్న భోజనంలో కూరకు బదులుగా ఉప్పు

మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్ధులకు రోటీలో కూరకు బదులు ఉప్పును వేస్తున్నారు.  యూపీలోని మీర్జాపూర్ జిల్లా హినౌతా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనంలో ఇలా కూరకు బదులు ఉప్పును మాత్రమే వేస్తున్నారని ఎంక్వయిరీలో తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. భోజనాలు ఏర్పాటు చేసే సూపర్ వైజర్, టీచర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని, ఈ ఘటనకు కారణమైన టీచర్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఆ సూపర్ వైజర్ ను అధికారులు ఆదేశించారు.