AK47 గన్‭లు తీసుకుని ప్రగతి భవన్‭కు పోవాలి: ఆకునూరి మురళి

AK47 గన్‭లు తీసుకుని ప్రగతి భవన్‭కు పోవాలి: ఆకునూరి మురళి

విద్యను ధ్వంసం చేసినట్లే వ్యవసాయాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల పరిస్థితులపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పొలం కలిగి.. అమెరికాలో ఉండే బిజినెస్ మాన్ బ్యాంకు అకౌంట్‭లో లక్షల్లో రైతుబంధు వేస్తున్నారు కాని.. ఇక్కడ ఉండే పేద రైతుల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధితులంతా ఏకే47 గన్‭లు తీసుకుని ప్రగతి భవన్‭కు పోవాలని ఆయన అన్నారు. 

తెలంగాణ డిక్షనరీలో కైలు రౌతుల ఊసే లేదని ప్రభుత్వంపై ఆకునూరి మురళి మండిపడ్డారు. సినిమా హీరో, హీరోయిన్లు, ఎన్నారైలను రైతులుగా చూస్తున్నారని.. అసలు వాళ్లకి ఎందుకు రైతుబంధు డబ్బులు వేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులు ఉన్నారని.. వారి గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.