లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు స్వాధీనం

లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు స్వాధీనం

ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు అక్రమ డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారు. సోమవారం  నారాయణ గూడలో రూ.8 కోట్లు పట్టుబడిన సంగతి మరువక ముందే నేడు లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బును కారులో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.