రూ.34 కోట్ల బెట్టింగ్..31 మంది అరెస్ట్

రూ.34 కోట్ల బెట్టింగ్..31 మంది అరెస్ట్

కడప జిల్లాలోని  ప్రోద్దుటూరు కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..31మంది క్రికెట్ బూకీలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ కమ్యూనికేటర్లు, ఏడు ల్యాప్ టాప్ లు, ఆరు కిలోల గంజాయి, లక్ష రూపాయల నగదు, రెండు వాహనాలు, బెట్టింగ్ అకౌంట్ బుక్కులు, క్యాల్కులెటర్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, గోవా నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ తో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఐపీఎల్ సీజన్ లో రూ. 34కోట్ల మేర బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు..ఎస్పీ కార్యాలయ ఆవరణంలో వివరాలను మీడియాకు వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు పోలీసులు.