హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. 2024, మార్చి 6వ తేదీ బుధవారం రాత్రి 12.30 గంటల సమయంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టి హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా క్రిస్టా కారులో తరలిస్తున్న రూ.50 లక్షలను సీజ్ చేసిన పోలీసులు.. విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులను మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును, నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సీజ్ చేసిన రూ.50 లక్షలను ఐటీ డిపార్ట్మెంట్ కు అప్పగించనున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.