హైదరాబాద్, వెలుగు: అడ్వకేట్ల సంక్షేమం కోసం గతంలో ఇచ్చిన రూ.100 కోట్ల నిధులకు అదనంగా మరో రూ.200 కోట్లు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్లీగల్సెల్తీర్మానం చేసింది. శనివారం తెలంగాణ భవన్లో డెయిరీ డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్సోమ భరత్కుమార్అధ్యక్షతన బీఆర్ఎస్లీగల్సెల్సమావేశం జరిగింది. దీనికి ప్లానింగ్బోర్డు వైస్చైర్మన్వినోద్కుమార్సహా పలువురు నేతలు హాజరయ్యారు. అడ్వకేట్ల సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేశారు.
కొత్తగా మరో10 వేల మంది అడ్వకేట్లకు హెల్త్ఇన్సూరెన్స్వర్తింపజేయాలని తీర్మానించారు. అడ్వకేట్లకు ఇండ్ల స్థలాలు, టెన్యూర్పీపీల కొనసాగింపు, పీపీ, జీపీ, ఏజీపీల సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ..ఈ తీర్మానాలను సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ప్రభుత్వానికి, బీఆర్ఎస్పార్టీకి వచ్చే ఎన్నికల్లో అడ్వకేట్ల అండగా నిలవాలని కోరారు. సమావేశంలో సీనియర్అడ్వకేట్ల గండ్ర మోహన్రావు, సహోదర రెడ్డి, గణేశ్, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, దేవేందర్రెడ్డి, రమణారెడ్డి, అంజయ్య, రాజ్కుమార్, మధుసూదన్ రావు, కళ్యాణ్రావు, లలితా రెడ్డి, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.