- బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు సమీపిస్తున్నందున షరా మామూలుగా అన్ని దోపిడీ పార్టీలు మళ్లీ బీసీ సమావేశాలు పెడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆత్మీయ సమ్మేళనాలు, దావత్లు ఏర్పాటు చేస్తున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని గురువారం ట్వీట్ చేశారు. ఆ మీటింగ్లకు వెళ్లే బీసీ నాయకులు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తెచ్చుకోగలుగుతారా? అని ప్రశ్నించారు. ఒకసారి చరిత్ర పుటలను తిరగేస్తే నిజం తెలుస్తుందన్నారు.
‘మన సీట్లు మనం తెచ్చు కోలేనపుడు సమావేశాలు ఎవరి కోసం? మనకు బహుజన రాజ్యం కావాలి. మనం లబ్ధిదారులం కాదు.. అధికారానికి హక్కుదారులం. రండి కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.