మునుగోడులో డబ్బులు పంచుతుండ్రు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మునుగోడులో డబ్బులు పంచుతుండ్రు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గత పాలకులు మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడులో డబ్బులు పంచి ఎమ్మెల్యేలుగా గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో  భూ బాధితులను ఆయన పరామర్శించారు. బీఎస్పీని గెలిపిస్తే.. రాజకొండలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.


మునుగోడులో బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చామని ప్రవీణ్ కుమార్ అన్నారు. కొందరు ఓటమి భయంతో డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.  ప్రాజెక్టుల పేరుతో పేదల నుంచి భూములను లాక్కున్నారని.. అందుకు ఇచ్చిన నష్టపరిహారం కూడా బాధితులకు ఏమాత్రం సరిపోదన్నారు.