హైదరాబాద్, వెలుగు: ఓ మైనర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సాయి భగీరథ్పై పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్చేయాలని డిమాండ్ చేశారు. మహీంద్ర యూనివర్సిటీలో బండి సాయి భగీరథ్పై రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు.
శనివారం తెలంగాణభవన్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. మైనర్ తల్లి 8 గంటలు పేట్బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నా పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. సంజయ్, రేవంత్, కిషన్రెడ్డికి అవినాభావ సంబంధం ఉందనే పోలీసులు పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
