కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలే దిక్కు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలే దిక్కు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబాబాద్: కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎర్రమట్టి తండాకు చెందిన నిరుద్యోగి భూక్యా వినయ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలతో ఉద్యోగం రాదని మానసికంగా కుంగిపోయి ఆత్మ బలిదానం చేసుకున్నారని వాపోయారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధప్రాతిపదికన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి,ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఎటువంటి పేపర్ లీకేజీలు లేకుండా ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేయాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.