దోపిడీ పాలకులను ఓటుతో గద్దెదించుదాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దోపిడీ పాలకులను ఓటుతో గద్దెదించుదాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వం తమ భూమిని తీస్కోని నష్టపరిహారం చెల్లించలేదని ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణలోని పాలన ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. కేసీఆర్ దౌర్భాగ్య పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘ఒక భాదిత కుటుంబం సీఎం అధికారిక నివాసాన్నే ఆత్మహత్యాయత్నానికి వేదికగా చేసుకొనే పరిస్థితి వచ్చిందంటే మన బంగారు తెలంగాణలో పాలన ఎంత ఘోరంగా ఉందో ఒక్క సారి ఆలోచించండి.  ప్రజలారా, దయచేసి ప్రాణాలు తీసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ఓటుతో ఈ దోపిడి పాలకులను గద్దె దించుదాం రండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.