కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే దీక్షలు

కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే దీక్షలు

హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు దీక్షలు చేస్తున్నారు. ఈ విషయంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ దీక్షలు కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమని ఆయన విమర్శించారు. ఇలాంటి దీక్షలతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు కోసం ఏడేళ్లుగా ఎన్నడూ పార్లమెంటును స్తంభింపజేయని టీఆర్ఎస్ ఎంపీలు.. అకస్మాత్తుగా బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ, తస్మాత్ జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు.  

మరిన్ని వార్తల కోసం:

యువీ.. నీ జీవితం అందరికీ ఆదర్శం

బయ్యారం పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు

నదికి నడక నేర్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్