రాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనదు : కాచం రమేష్

రాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనదు : కాచం రమేష్

మునుగోడు ఉప ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే నిర్వహించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నేత కాచం రమేష్ అన్నారు. మునుగోడులో ఆర్ఎస్ఎస్ ఎటువంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ఎస్ దేశ నిర్మాణం, సంస్కృతి కోసం పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమేనని.. రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. రాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ పాల్గొనదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రమే ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందని చెప్పారు.