పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో.. పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి పాపయ్యపేట గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపాడు. ఆ తర్వాత ప్రయాణికులంతా కిందకు దిగారు. దీంతో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.