డిసెంబర్ 19, 20న ఆర్టీసీ కార్గోలో వేలం

డిసెంబర్ 19, 20న ఆర్టీసీ కార్గోలో వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో సర్వీసు సెంటర్​లో కస్టమర్లు క్లెయిమ్​చేయని వస్తువులను మరోసారి వేలం వేస్తున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్​మేనేజర్​(లాజిస్టిక్స్​) ఇషాక్​బిన్​ మహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వినియోగ దారులకు వారి పార్శిళ్లు​తీసుకెళ్లాల్సిందిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పార్శిల్​ తీసుకెళ్లడం లేదన్నారు. 

ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఆయా వస్తువులను జప్తు చేసి వేలం వేస్తుందని తెలిపారు. ఈ నెల19, 20వ తేదీల్లో సికింద్రాబాద్​జేబీఎస్​లోని కార్గో విభాగంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం జరుగుతుందని తెలిపారు. మొత్తం 136 వస్తువులు వేలం వేయనున్నట్టు తెలిపారు.