అశ్వత్థామ రెడ్డి లీవ్ కు ఆర్టీసీ నో

అశ్వత్థామ రెడ్డి లీవ్ కు ఆర్టీసీ నో

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి లీవ్ అప్లికేషన్ ను అధికారులు రిజెక్ట్ చేశారు. సమ్మె తర్వాత యూనియన్ లీడర్లకు ఉన్న లీవ్ రిలీఫ్ ను అధికారులు క్యాన్సిల్ చేశారు. టీఎంయూ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో అశ్వత్థామ రెడ్డితో సహా లీడర్లంతా రిపోర్ట్ చేశారు. ఆ వెంటనే సెలవులు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు లీవ్ కావాలని కోరారు. ‘మీ లీవ్ అప్లికేషన్ పరిశీలించినం.

సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సేవలు అవసరం. అందుకే లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాం.  వెంటనే రిపోర్ట్ చేయండి’ అని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 6వ తేదీనే జారీ చేయగా, శుక్రవారం బయటకు వచ్చింది. అయితే, అశ్వత్థామ రెడ్డి మాత్రం ఇంకా విధులకు హాజరు కాలేదు.